ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఈసారి వ్యూయర్ షిప్ లో గత రికార్డులన్నింటినీ చెరిపేసింది. ఈ టోర్నీలోని మొత్తం మ్యాచ్ లకు 6.58 బిలియన్ వ్యూస్ దక్కాయి. ఇది గత టి20 వరల్డ్ కఫ్ తో పోల్చితే 65 శాతం ఎక్కువ. వివిధ భాషల్లో మ్యాచ్ లకు కామెంటరీ చెప్పడంతోనే ఇది సాధ్యమైనట్లు ఐసిసి పేర్కొంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా డిజిటల్ మీడియాలో ఈ మ్యాచ్ లకు అత్యధిక ఆదరణ దక్కింది. ఫేస్ బుక్, ఇన్ స్టా లలో వచ్చిన క్రికెట్ రీల్స్ కు 6.1 బిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ టోర్నీ మొత్తంలో హైలైట్ గా నిలిచిన భారత్–పాక్ మ్యాచ్ ను కేవలం ఇండియాలోనే 256 మిలియన్ గంటల స్ట్రీమింగ్ సాధ్యమైంది.