ఐసిసి: అంపైరింగ్​లో కీలక మార్పులు

By udayam on May 24th / 3:58 am IST

క్రికెట్​లో తిరిగి న్యూట్రల్​ అంపైర్ల (మ్యాచ్​లు ఆడే దేశాలకు చెందని అంపైర్లు) విధానాన్ని ఐసిసి ప్రవేశపెట్టింది. కొవిడ్​–19 తర్వాత ఎక్కడైతే మ్యాచ్​లు జరుగుతాయో ఆ దేశానికి సంబంధించిన అంపైర్లనే ఇప్పటి వరకూ ఐసిసి కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు కొవిడ్​ చివరి దశకు రావడంతో న్యూట్రల్​ అంపైరింగ్​ పద్దతిని తిరిగి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని ఐసిసి ప్రెసిడెంట్​ గ్రెగ్​ బార్క్లే వెల్లడించారు. ఈ నిర్ణయంతో మ్యాచ్​లు మరింత పారదర్శకంగా ఉంటాయని తెలిపారు.

ట్యాగ్స్​