భారత దేశపు ఐకానిక్ కార్ మోడల్ అంబాసిడర్ ఎలక్ట్రిక్ కారుగా తిరిగి ఎంట్రీ ఇవ్వనుంది. హిందుస్థాన్ మోటార్స్కు చెందిన దిగ్గజ బ్రాండ్ను ఎలక్ట్రిక్గా రీ బ్రాండ్ చేసి భారత మార్కెట్కు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఓ యూరోపియన్ కంపెనీతో హిందుస్థాన్ మోటార్స్ జట్టు కట్టనుంది. దీనిపై 51:49 పద్దతిలో ప్రాఫిట్ షేర్ కోసం ఈ కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఎలక్ట్రిక్ అంబాసిడర్తో పాటు మరో ఎలక్ట్రిక్ కారునూ హిందుస్థాన్ మోటార్స్ తీసుకురానుంది.