ఈశాన్య రుతుపవనాల సీజన్ నేపథ్యంలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా, ఆగ్నేయ బంగాళాఖాతం-ఉత్తర అండమాన్ సముద్రాలను ఆనుకుని ఈ ఉదయం అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఈ నెల 19 నాటికి వాయుగుండంగా బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుందని ఐఎండీ వివరించింది. ఆపై రాగల మూడ్రోజుల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది.