గోధుమల ఎగుమతిపై భారత్ విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా భారత్కు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్న ఆమె వీలైనంత త్వరగా ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి కోరారు. అయితే భారత్ వైపు నుంచి చూస్తే ఈ నిషేధాన్ని అర్ధం చేసుకోగలమని.. అదే సమయంలో భారత్ కూడా ప్రపంచం వైపు చూడాలని ఆమె పేర్కొన్నారు.