పాక్​: భారత్ ఇచ్చిన బంగారు పతకాన్నీ అమ్ముకున్న ఇమ్రాన్​

By udayam on November 23rd / 7:38 am IST

మాజీ క్రికెటర్, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు విమర్శల పాలయ్యారు. ప్రధానిగా విదేశాలలో పర్యటించినపుడు అందుకున్న బహుమతుల దుర్వినియోగంపై ఇమ్రాన్ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇమ్రాన్ పై పాక్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. ప్రధానిగానే కాదు.. క్రికెటర్ గా ఉన్నపుడు విదేశాలలో అందుకున్న బహుమతులను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్నాడని మండిపడ్డారు. భారత్ ఇచ్చిన ఓ బంగారు పతకాన్ని ఇలాగే అమ్ముకున్నాడని ఆరోపించారు. అయితే, దీని గురించి మంత్రి మిగతా వివరాలను వెల్లడించలేదు.

ట్యాగ్స్​