పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రభుత్వానికి చెందిన కార్ ను తనతో పాటు తీసుకెళ్లిపోయారని ఆ దేశ ఐటి మంత్రి మరియం ఆరోపించారు. మన కరెన్సీలో రూ.6.19 కోట్ల విలువైన బిఎండబ్ల్యు ఎక్స్5 కారును ప్రధాని కార్యాలయానికి టాగ్ చేయాల్సి ఉండగా.. ఇమ్రాన్ ఆ పని చేయలేదని, ఇప్పటికీ ఆ కారును తన వద్దనే ఉంచుకున్నాడని మరియం విమర్శించారు. పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన ఖరీదైన వజ్రాభరణాలను దుబాయ్లో అమ్ముకున్నాడని సైతం ఇమ్రాన్పై గతంలో ఆరోపణలు వచ్చాయి.