ఈ ఏడాది భారతీయులు సెకనుకు 2 బిర్యానీలు ఆర్డర్ చేశారని స్విగ్గీ వెల్లడించింది. వరుసగా ఏడో ఏడాది కూడా తమ యాప్ లో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ బిర్యానీ యేనని పేర్కొంది. ఒక్క నిమిషంలో తమ యాప్ లో దేశవ్యాప్తంగా 137 బిర్యానీల కోసం ఆర్డర్లు వస్తున్నాయని, అంటే సెకనుకు 2.28 బిర్యానీల కోసం భారతీయులు ఆర్డర్ చేస్తున్నట్లు పేర్కొంది. మసాలా దోశ ఈ లిస్ట్ లో రెండో స్థానంలో ఉండగా.. స్నాక్స్ విభాగంలో సమోసా అగ్రస్థానంలో నిలిచింది.