బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. 278/6 తో రెండో రోజు ఆటను మొదలెట్టిన భారత్ వెంటనే శ్రేయస్ అయ్యర్ (86) వికెట్ ను కోల్పోయింది. ఆపై రవిచంద్రన్ అశ్విన్ 58, కుల్దీప్ యాదవ్ 40 పరుగులతో భారత స్కోరును 400 కు చేర్చారు. చివర్లో ఉమేష్ 15, సిరాజ్ 4 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 4, మెహిదీ హసన్ 4 వికెట్లు తీశారు.