భారత్ తో జరుగుతున్న 2వ టెస్ట్ లో ఆతిధ్య బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు నష్టపోయి 50 ఓవర్లకు 173 పరుగులు చేసింది.టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 15వ ఓవర్ వరకూ వికెట్ కోల్పోలేదు. ఆపై 39 పరుగుల వద్ద ఓపెనర్లిద్దరూ వెంట వెంటనే ఔట్ అయ్యారు. ఆపై మోమినుల్ హక్ 59* పరుగులతో ఇన్నింగ్స్ ను కాస్త చక్కదిద్దాడు. అతడికి ముష్ఫికర్ రహీమ్ 26, లిటన్ దాస్ 24 పరుగులతో సహకరించారు. భారత బౌలర్లలో ఉనద్కత్ 2, అశ్విన్ 2, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశారు.