రిటైల్ ద్రవ్యల్భణం 8 ఏళ్ళ గరిష్ఠానికి చేరుకుంటుందన్న రిపోర్ట్లు వచ్చిన వెంటనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గోధుమ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిషేధం విధించిన వాటిల్లో హై ప్రొటీన్ దురుమ్తో పాటు సాఫ్ట్ బ్రెడ్ వెరైటీలు కూడా ఉన్నాయి. గోధుమ ఎగుమతులను ఉచిత కేటగిరీ నుంచి నిషేధిత కేటగిరీకి మార్పు చేసింది. నిషేధం అమలులోకి రాక ముందే పేమెంట్ జరిపిన దేశాలకు మాత్రమే గోధుమల్ని ఎగుమతి చేయాలని పేర్కొంది.