శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు బ్యాటర్లు రోహిత్ శర్మ 83, శుభ్ మన్ గిల్ 70, కోహ్లీ 113 పరుగులు చేసి జట్టుకు 373 పరుగుల భారీ స్కోరును అందించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలో దిగిన శ్రీలంక బ్యాటర్లు 50 ఓవర్లలో 306 పరుగులు చేశారు. ఈ క్రమంలో 8 వికెట్లు కోల్పోయింది. శనక 88 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్స్లో 108 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, మొహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. షమీ, హార్దిక్ పాండ్యా, చాహల్ చెరో వికెట్ తీశారు.