INDvsSL: ఉత్కంఠ పోరులో భారత్​ ఘన విజయం

By udayam on January 4th / 5:39 am IST

కొత్త ఏడాది భారత్​ ఘన విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో నిన్న ప్రారంభమైన తొలి టి20 మ్యాచ్​ లో చివరి బంతికి 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్​ ఓడి బ్యాటింగ్​ కు దిగిన భారత్​ కు దీపక్​ హుడా 41, ఇషాన్​ కిషన్​ 37, అక్షర్​ పటేల్​ 31 పరుగులు చేయడంతో 162 పరుగులు చేసింది. ఆపై శ్రీలంక బ్యాటర్లు బ్యట్​ ఝులిపించడంతో ఓ దశలో భారత్​ ఓటమి దిశగా ప్రయాణించింది. అయితే చివరి ఓవర్లో అక్షర్​ పటేల్​ కట్టుదిట్టంగా బౌలింగ్​ చేయడంతో లంక 160 పరుగులకు సరిపెట్టుకుంది.భారత్​ బౌలర్లలో మావి 4, ఉమ్రాన్​ 2, హర్షల్​ 2 వికెట్లు తీశారు.

ట్యాగ్స్​