వచ్చే పాతికేళ్ళలో భారత ఆర్ధిక వ్యవస్థ 40 ట్రిలియన్ల మార్క్ కు చేరుకుంటుందని రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ అంచనా వేశారు. రిలియెన్స్ ఫ్యామిలీ డే ఫంక్షన్ లో మాట్లాడిన ఆయన భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొనే సమయానికి మన ఆర్ధిక వ్యవస్థ 40 ట్రిలియన్ డాలర్ల మార్క్ ను అందుంటుందని తెలిపారు. 2027 నాటికి రిలయెన్స్ మార్కెట్ విలువను రెండింతలు చేసేలా 2.27 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.