శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా ఈరోజు లంకేయులతో రెండో వన్డేకు సిద్ధమవుతోంది. కలకత్తా వేదికగా జరిగే ఈ వన్డే లో గెలిచి ఈ సిరీస్ ను దక్కించుకోవాలని రోహిత్ సేన ప్రాక్టీస్ ను ముమ్మరంగా చేస్తోంది. సీనియర్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీతో పాటు గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ లు ఫామ్ కొనసాగిస్తుండడం భారత్ కు కలిసి వచ్చే అంశం. మరో వైపు జమ్మూ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ వేగానికి, సిరాజ్, షమిల లైన్ అండ్ లెంగ్త్ తోడైతే ఈ రోజు మ్యాచ్ లో భారత్ విజయాన్ని ఆపడం లంక తరం కాదు.