ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణానికి భారత్ సిద్ధమవుతోంది. లిక్విడ్ మిర్రర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ టెలిస్కోప్ను సిద్ధం చేయాలని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ సంస్థ ప్రకటించింది. దీనిని ఉత్తరాఖండ్లోని దేవస్థల్ వద్ద 2450 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. దీని సాయంతో సూపర్ నోవాస్, గ్రావిటేషనల్ లెన్సెస్, అంతరిక్ష వ్యర్థాలు, గ్రహశకలాలను ట్రాక్ చేయొచ్చని ప్రొఫెసర్ దీపాంకర్ బెనర్జీ తెలిపారు.