గడిచిన ఆర్దిక సంవత్సరంలో భారత స్టార్టప్ కంపెనీలకు 100 దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రారంభమైన ఉత్తరప్రదేశ్ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో 84 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత స్టార్టప్ లు సాధించాయని హర్షం వ్యక్తం చేశారు. ‘భారత సత్తా ఏంటన్నది ప్రపంచం నోరెళ్ళబెట్టి చూస్తోంది. జి20 దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుదేలవుతున్న నేటి ప్రపంచంలో భారత్ దూసుకుపోతోంది’ అని పేర్కొన్నారు.