పంచదార ఎగుమతిపై కేంద్రం నిషేధం

By udayam on May 25th / 12:50 pm IST

దేశంలో ఉత్పత్తమవుతున్న పంచదారను ఎగుమతి చేయడంపై కేంద్రం ఈరోజు నిషేధం విధించింది. గత వారం గోధుమల ఎగుమతిని నిషేధించిన కేంద్రం తాజాగా చక్కెరనూ నిషేధిత జాబితాలోకి చేర్చింది. జూన్​ 1 నుంచి ఈ చక్కెర ఎగుమతుల నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంది. దేశీయ మార్కెట్​లో దీని రేటు పెరగకుండా చూడడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాయిటర్స్​ రిపోర్ట్​ చేసింది. అయితే సీఎక్స్​ఎల్​, టీఆర్​క్యూల రూపంలో యూరోపియన్​ యూనియన్​, అమెరికాలకు ఎగుమతులు కొనసాగుతాయి.

ట్యాగ్స్​