ఆటోమొబైల్ రంగంలో భారత్ అగ్రరాజ్యంగా మారుతోంది. లైట్ వెహికల్ మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న జపాన్ ను భారత్ వెనక్కి నెట్టింది. 2022 లో పెరిగిన వ్యక్తిగత వాహనాల విక్రయాలతో భారత్ ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది ఏకంగా 50 లక్షల లైట్ వెహికల్స్ ను భారత్ లో నిర్మించారు. ఎస్ అండ్ పి ప్రకారం భారత్ లోనే అత్యధిక లైట్ వెహికల్స్ నిర్మాణం జరిగిందని పేర్కొంది. జపాన్ లో ఈ సంఖ్య 42 లక్షలుగా మాత్రమే ఉంది.