వాతావరణ మార్పుల్లో భారత్ తన ర్యాంకును మరింత మెరుగు పరచుకుంది. మంగళవారం విడుదలైన క్లైమేట్ ఛేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ర్యాంకుల్లో భారత్ గతేడాదితో పోల్చితే రెండు ర్యాంకులు మెరుగై 8వ స్థానంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా తగ్గుతున్న కర్భన ఉద్గారాల విడుదలకు తోడు, రెన్యూవబుల్ ఎనర్జీ వాడకం పెరగడం కూడా ఈ ర్యాంకు మెరుగవ్వడానికి ప్రధాన కారణంగా తెలిపింది. మొత్తం 63 దేశాలకు జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్ స్టిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్ వర్క్ సంస్థలు ర్యాంకుల్ని ఇస్తుంటాయి.