థామస్​ కప్​ గెలుచుకున్న భారత్​

By udayam on May 16th / 6:56 am IST

థామస్​ కప్​ బ్యాడ్మింటన్​ పోటీలో 14 సార్లు ఛాంపియన్​ అయిన ఇండోనేషియాకు ఝలక్​ ఇస్తూ భారత్​ ఘన విజయం సాధించింది. దీంతో తొలిసారిగా ఈ ఛాంపియన్​షిప్​ను మన దేశం గెలుచుకున్నట్లయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆటగాళ్ళకు ఫోన్ చేసి అభినందించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ ప్లేయర్లకు రూ.1 కోటి నజరానా ప్రకటించారు. ఈ విజయాన్ని సునీల్​ గవాస్కర్​ భారత్​ 1983లో గెలిచిన వరల్డ్​ కప్​తో పోల్చారు.

ట్యాగ్స్​