INDvsSL: భారత్​ @ 373/7

By udayam on January 10th / 12:17 pm IST

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్​ తన తొలి ఇన్నింగ్స్​ ను 373 పరుగుల వద్ద ముగించింది. విరాట్​ కోహ్లీ 113, రోహిత్​ శర్మ 83, శుభ్​ మన్​ గిల్​ 70, కెఎల్​ రాహుల్​ 39 పరుగులతో రాణించారు. ఓపెనర్లు రోహిత్​, గిల్​ లు తొలి వికెట్​ కు 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆపై గిల్​ ఔట్​ అయిన తర్వాత వచ్చిన కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లంక బౌలర్లను ఓ రేంజ్​ లో ఆడుకున్న అతడు వచ్చిన జీవన దానాలను సద్వినియోగం చేసుకుంటూ సెంచరీని నమోదు చేశాడు. లంక బౌలర్లలో కసున్​ రజిత 3 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్​