న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 306 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (80), కెప్టెన్ శిఖర్ ధావన్ (72), శుభ్ మన్ గిల్ (50) అర్ధ సెంచరీలు బాదారు. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ 36 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ 37 (16 బంతుల్లోనే – 3×4 – 3×6) లతో విరుచుకుపడడంతో జట్టు స్కోర్ 306 పరుగులకు చేరింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గ్స్యూసన్ 3, టిమ్ సౌథీ 3, మిల్నే 1 వికెట్ తీశాడు.