దేశీయంగానే హైపర్లూప్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని భారత రైల్వేస్ భావిస్తోంది. ఇందుకోసం ఐఐటి మద్రాస్ సంస్థతో కలిసి హైపర్లూప్ టెక్నాలజీపై పనిచేయాలని నిర్ణయించింది. అయస్కాంత శక్తితో లో ప్రెజర్ ట్యూబ్స్లో కదిలో పాడ్స్లో ప్రయాణించేలా ఈ హైపర్లూప్ పనిచేస్తుంది. భూమి మీద విమానం వంటి స్పీడ్ను అందుకోవడం ఈ హైపర్లూప్లో ప్రత్యేకత. అత్యంత ఖరీదైన ఈ టెక్నాలజీని రైల్వేస్ సంస్థ తక్కువ ఖర్చుకే పూర్తి చేయాలని భావిస్తోంది.