జులై చివరి నుంచి ఆగస్ట్ 7 వరకూ భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. జులై 22న తొలి వన్డే, 24,27 తేదీల్లో 2, 3 వన్డేలను భారత్ అక్కడి క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంలో ఆడనుంది. జులై 29 నుంచి ప్రారంభం అయ్యే 5 మ్యాచ్ల టి20 సిరీస్లో ఆగస్ట్ 1, 2, 6, 7 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డ్ ఈ టోర్నీలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ వన్డే, టి20 సిరీస్లకు భారత్ తమ జట్లను ఇంకా ప్రకటించలేదు.