ముగిసిన తొలిరోజు ఆట.. భారత్​ 19/0

By udayam on December 22nd / 11:40 am IST

బంగ్లాదేశ్​ తో జరుగుతున్న రెండో టెస్ట్​ తొలి రోజు ఆటను భారత్​ 19/0 తో ముగించింది. అంతకు ముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న బంగ్లాను భారత బౌలర్లు 73.5 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్​ చేశారు. మొమినుల్​ హక్​ 84 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ఉమేష్​ యాదవ్​ 4, అశ్విన్​ 4 వికెట్లు తీయగా.. 11 ఏళ్ళ తర్వాత టెస్ట్​ జట్టులోకి వచ్చిన జయదేవ్​ ఉనద్కత్​ 2 వికెట్లతో రాణించాడు. ఆపై బ్యాటింగ్​ కు దిగిన భారత్​ 8 ఓవర్లు ఆడి 19 రన్స్​ కు వికెట్​ ను కోల్పోలేదు. గిల్​ 14, రాహుల్​ 3 పరుగులు చేశారు.

ట్యాగ్స్​