చెన్నైలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం కావాల్సిన మొదటి టెస్ట్కు బిసిసిఐ ప్రణాళికలు రచిస్తోంది.
బుధవారం చెన్నైకు చేరుకోనున్న ఇరు జట్లూ అక్కడ వారం రోజుల క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు కేవలం 3 రోజులు మాత్రమే రెండు జట్లకు ప్రాక్టీస్ లభించనుంది.
ఇప్పటికే శ్రీలంక పర్యటనను ముగుంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 32 మంది సభ్యులతో కలిసి రేపు ఉదయం చెన్నైలో దిగనుంది.
గత వారమే ఇక్కడకు చేరుకున్న బెన్స్టోక్స్, ఆర్చర్, రోరీ బర్న్స్తో కలిసి ఇంగ్లాండ్ జట్టు మొత్తం వారం పాటు క్వారంటైన్లో ఉండనుంది.