ఉప్పల్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే బుధవారం జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు భారత జట్టు కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మరోవైపు సూపర్ ఫాం లోకి వచ్చిన విరాట్ కోహ్లీ పైనే క్రికెట్ అభిమానుల కళ్ళన్నీ ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ వద్ద 46 వన్డే సెంచరీలు ఉండగా.. త్వరలోనే సచిన్ (49 సెంచరీలు) రికార్డును చెరిపేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.