హాకీ ఆసియా కప్లో భాగంగా దాయాది దేశాలు భారత్, పాక్ల మధ్య తొలి పోరు నేడు ప్రారంభం కానుంది. ఇండోనేషియాలోని జకార్తాలో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2017లో చివరి సారిగా జరిగిన ఆసియా కప్ను భారత్ గెలుచుకుంది. ఇప్పటి వరకూ ఈ కప్పును ఇరు దేశాలు రెండేసి సార్లు గెలుచుకున్నాయి. ఒలింపిక్స్లో భారత్ హాకీ జట్టు కాంస్యం గెలవడంతో దేశంలో ఈ క్రీడపై ఆశక్తి రోజురోజుకీ పెరుగుతోంది.