న్యూజిలాండ్ తో జరుగుతున్న 3 మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ 1–0 తేడాతో సొంతం చేసుకుంది. ఈరోజు జరిగిన 3వ టి20 మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను టై గా ప్రకటించారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 9 ఓవర్లకు 75 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ సరిగ్గా టై అవ్వడానికి కావాల్సిన పరుగులు చేయడంతో మ్యాచ్ ను టైగా ప్రకటించారు. దీంతో ఈ సిరీస్ ను భారత్ గెలుచుకున్నట్లయింది. సిరాజ్ కు (4/17) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
Mohammed Siraj is adjudged Player of the Match for his brilliant bowling figures of 4/17 as the final T20I ends in a tie on DLS.
Scorecard – https://t.co/rUlivZ308H #NZvIND pic.twitter.com/kSHPp8wFTx
— BCCI (@BCCI) November 22, 2022