భారత్ లో అత్యంత తక్కువ ధరల్లో ఇంటర్నెట్ దొరుకుతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న యువతలో చాలా మంది గేమ్స్ కు అలవాటు పడుతున్నట్లు మై స్మార్ట్ ప్రైస్ సర్వేలో వెల్లడైంది. 14,349 మందిపై జరిగిన ఈ సర్వేలో 42.7 శాతం మంది కేవలం గేమింగ్ కోసమే ఇంటర్నెట్ ను వాడుతున్నట్లు తెలిపారు. వీరిలో 19–24 ఏళ్ళ మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు. వీరి తర్వాత 16–18 ఏళ్ళ వయసు వారిలోనూ గేమింగ్ ఎక్కువగా ఆడుతున్నారని, 30+ వయసు వారిలో కేవలం 4.6 శాతం మంది మాత్రమే గేమ్స్ ఆడుతున్నట్లు వెల్లడించారు.