కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు–2 సినిమా కొత్త షెడ్యూల్ తేదీ ఖరారైంది. ఈనెల 22 నుంచి ఈ మూవీ మరోసారి సెట్స్ పైకి వెళ్ళనుంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఈసారి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఏప్రిల్ నెలాఖరులోగా షూటింగ్ ను పూర్తి చేయనున్నారని టాక్. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.