భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా అతడి కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన తలకు, నడుం, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలు విరిగినట్లు ఎక్స్ రేలో కనిపిస్తోంది. అతడి కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత కారు మంటల్లో చిక్కుకోగా పంత్ ఎలాగోలా కారు నుంచి బయటపడ్డాడు. ఢిల్లీ–డెహ్రాడూన్ హైవే పై హమ్మద్ పూర్ జల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Get Well Soon Rishabh Pant💜#Rishabpant pic.twitter.com/d3gNHRanin
— Rasul Jaansum786 (@Rasuljaansum111) December 30, 2022