కాంచెన్​గంగ అధిరోహిస్తూ భారతీయుడు మృతి

By udayam on May 7th / 5:27 am IST

నేపాల్​లోని మౌంట్​ కాంచెన్​గంగను అధిరోహిస్తున్న సమయంలో భారతీయ పర్వతారోహకుడు మరణించాడు. మహారాష్ట్రకు చెందిన 52 ఏళ్ళ నారాయణన్​ అయ్యర్​ గురువారం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పర్వతం కాంచెన్​ గంగ పైన 8,200 మీటర్ల ఎత్తులో మరణించాడని ఈ ప్రయోగానికి డైరెక్టర్​గా ఉన్న నివేక్​ కర్కి తెలిపారు. ఆ పర్వతం అసలు ఎత్తు 8,583 మీటర్లు కాగా.. 8,200 మీటర్ల ఎత్తులో తలెత్తిన హై ఆల్టిట్యూడ్​ సిక్​నెస్​ కారణంగా ఆయన మరణం సంభవించిందని తెలిపారు.

ట్యాగ్స్​