నాలుగేళ్ళుగా ఆస్ట్రేలియా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఓ మేల్ నర్స్ ను ఢిల్లీ పోలీసులు భారత్ లో అరెస్ట్ చేశారు. రజవీందర్ సింగ్ అనే ఈ 37 ఏళ్ళ వ్యక్తి ఆస్ట్రేలియాలో నర్స్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు 2018 అక్టోబర్ 21న అక్కడి క్వీన్స్ లాండ్ లోని ఓ బీచ్ లో 24 ఏళ్ళ మహిళను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. హత్య జరిగిన 2 రోజుల తర్వాత అతడు భారత్ కు పారిపోయి వచ్చి దాక్కున్నాడు. దీంతో ఆసీస్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సాయం తీసుకుని అతడిని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే అతడిని తాజాగా అరెస్ట్ చేశారు. అతడి ఆచూకీపై ఆసీస్ పోలీసులు రూ.5 కోట్ల నజరానా కూడా ప్రకటించారు.