శని, ఆదివారాల్లో రెండురోజులపాటు ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు జరనున్న వేళ … హైదరాబాద్ నగరంలోని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉత్కంఠభరితమైన రేసింగ్ లీగ్కు నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం సిద్ధమయ్యింది. ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ మాట్లాడుతూ … శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ను పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. రేసింగ్ పోటీలు జరుగనుండగా, ట్రాక్ పనులు చేసేందుకు నేటి నుంచే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ట్రాక్ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు రోడ్డును మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వాహనదారులు ఎన్టీఆర్ మార్గ్ వైపు కాకుండా వేరే మార్గాల నుండి వెళ్లాలని పోలీసులు సూచించారు.
India's first mega Racing track event in Hyderabad…
Indian Racing League will be held in #Hyderabad on November 19th and 20 th…
Formula E Championship scheduled to be held in #Hyderabad in February 2023… pic.twitter.com/BAoJMNjxmd
— AR (@AshokReddyNLG) November 17, 2022