శ్రీలంకతో తొలి టి20 నేడే

By udayam on January 3rd / 6:02 am IST

కొత్త ఏడాదిలో భారత్​ తన తొలి మ్యాచ్​ ను ఈరోజు శ్రీలంకతో ఆడనుంది. హార్ధిక్​ పాండ్య కెప్టెన్​ గా ఉండనున్న ఈ జట్టులో రోహిత్​, ధావన్​, కోహ్లీ, రాహుల్​ లకు విశ్రాంతిని ఇచ్చారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్​ లో గెలిచి ఈ ఏడాదికి శుభారంభం ఇవ్వాలని మన యువ క్రికెట్​ టీం ఉవ్విళ్ళూరుతోంది. యువ ఆటగాళ్లు శివమ్‌ మావి, ముకేశ్‌ కుమార్‌ తొలి సారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు వన్డేలు, టెస్టులలో అదరగొడుతున్న యవ ఓపెనర్‌ శుబ్‌మాన్‌ గిల్‌కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ట్యాగ్స్​