ఇండియన్స్​: రోజుకు 7.3 గంటలు ఫోన్స్​ లోనే

By udayam on December 14th / 12:42 pm IST

రోజుకు సరాసరి 7.3 గంటల పాటు భారతీయులు ఫోన్స్​ లోనే కాలం గడిపేస్తున్నారని రెడ్​ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్​​ సంస్థ తన లేటెస్ట్​ నివేదికను వెల్లడించింది. ఈ లెక్కన మనవాళ్ళు చైనీయులు, అమెరికన్లను కూడా దాటేసినట్లు వెల్లడించింది. మనవాళ్ళు ఎక్కువగా ఆన్​ లైన్​ మెసేజింగ్​, సోషల్​ మీడియా, యూట్యూబ్​ స్ట్రీమింగ్​, ఓటిటి కంటెంట్​, షార్ట్​ ఫార్మ్​ వీడియో ల కోసమే మొబైల్​ ను వాడుతున్నారని పేర్కొంది. అమెరికన్లు రోజుకు 7.1 గంటలు, చైనీయులు రోజుకు 5.3 గంటలు మొబైల్​ ను వాడుతుంటే.. థాయిలాండ్​ వాసులు మనవాళ్ళను మించిపోయి రోజుకు 9.1 గంటల పాటు మొబైల్​ లోనే ఉంటున్నారట.

ట్యాగ్స్​