భారత్ లో వచ్చే ఏడాది 5జి హ్యాండ్ సెట్ల అమ్మకాలు జోరందుకోనుందని కౌంటర్ పాయింట్ సంస్థ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సంస్థలు 5జి సేవల్ని విరివిగా అందుబాటులోకి తేనున్న నేపధ్యంలో 4జి ఫోన్ల కంటే 5జి హ్యాండ్ సెట్ల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపనున్నట్లు తెలిపింది. తక్కువ ధరకే దొరికే 5జి హ్యాండ్ సెట్లకు భారీ డిమాండ్ ఏర్పడనుందని తెలిపింది. ఈ ఏడాది భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ గతేడాదితో పోల్చితే తగ్గిందన్న ఆ సంస్థ.. ఈ లోటును వచ్చే ఏడాది 5జి హ్యాండ్ సెట్ల అమ్మకాలు భర్తీ చేస్తుందని తెలిపింది.