ఈ ఏడాది అత్యధికంగా స్టాక్ మార్కెట్ లో లాభపడ్డ షేర్ ను మనీ కంట్రోల్ వెబ్ సైట్ రిపోర్ట్ చేసింది. పొద్దున్న లేచి పడుకునే వరకూ స్టాక్ మార్కెట్ పై పట్టున్న వారు కూడా గమనించని ఈ పెన్నీ స్టాక్ పేరు హేమంగ్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన భటియా ఇండస్ట్రీస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ షేర్. ఈ ఏడాది జనవరిలో ఈ స్టాక్ రేటు కేవలం రూ.3 మాత్రమే. అయితే ఇప్పుడు దాని ధర రూ.70 కి చేరుకుంది. అంటే ఏడాదిలో ఇది ఏకంగా 20 రెట్లు.. లేదా 2,277 శాతం లాభపడినట్లు లెక్క.