50 వేల సంవత్సరాలకు ఒక్కసారి కనిపించే అతిపెద్ద తోకచుక్కను భారత్ కు చెందిన చంద్ర టెలిస్కోప్ ఫొటోలు తీసింది. ఇండియణ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలో నడిచే ది హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ సాయంత్రం Comet C/2022 E3 ఫొటోల్ని తీశారు. సౌర కుటుంబం లోపలే తిరిగే ఇది ఫిబ్రవరి 1న భూమికి 42 మిలియన్ల కిలోమీటర్ల సమీపానికి రానుంది. ఎరుగు, గ్రీన్, బ్లూ ఫిల్టర్స్ తో కనిపించే ఈ తోక చుక్క ఎప్పటికీ మన సౌర కుటుంబంలోనే ఉండిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.