ఎండాకాలంలో థర్మల్ విద్యుత్కు డిమాండ్ పెరిగిన నేపధ్యంలో భారత్ తన బొగ్గు ఉత్పత్తిలో 28 శాతం వృద్ధిని సాధించింది. గడిచిన ఏప్రిల్ నెలలో 66.1 మెట్రిక్ టన్నుల మేర బొగ్గు ఉత్పత్తిని సాధించింది. ‘గడిచిన ఏప్రిల్లో మొత్తం 661.54 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది’ అని బొగ్గు శాఖ ప్రకటించింది. సింగరేణి కాలరీస్ నుంచి 5.3 మెట్రిక్ టన్నులు, కేప్టివ్ మైన్స్ నుంచి 7.3 మెట్రిక్ టన్నులు, కోల్ ఇండియా నుంచి 53.4 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది.