026 నాటికి దేశంలో డిజిటల్ పేమెంట్ల ద్వారా 10 ట్రిలియన్ డాలర్ల బిజినెస్ జరగనుందని బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వెల్లడించింది. ఫోన్పే సంస్థతో కలిపి జరిపిన ఈ సర్వేలో వచ్చే 4 ఏళ్ళలో డిజిటల్ పేమెంట్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3 ట్రిలియన్ డాలర్ల మేర డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయన్న ఈ సర్వే వచ్చే నాలుగేళ్ళలో మూడు రెట్ల వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ప్రతీ 3 పేమెంట్లలో రెండు డిజిటల్వే ఉంటాయని తెలిపింది.