భారత జిడిపి 2029 ఆర్ధిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ల మార్క్ను చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 నాటికల్లా 5 ట్రిలియన్ల జిడిపి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఐఎంఎఫ్ మాత్రం ఆ లక్ష్యం 2029 కే సాధ్యమవుతుందని పేర్కొంటోంది. 2028 నాటికి భారత జిడిపి 4.92 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, మరుసటి ఏడాదికి 5 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని పేర్కొంది. 2029 నాటికి డాలర్తో రూపాయి మారకం విలువ రూ.94కు చేరుతుందని పేర్కొంది.