భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టి20ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇరుజట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్కు వెల్లింగ్టన్ ఆతిథ్యమివ్వనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ, దినేశ్ కార్తీక్లకు విశ్రాంతినివ్వడంతో యువ క్రికెటర్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా, రిషభ్ పంత్ను వైస్ కెప్టెన్గా బిసిసిఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్ ను ఓటిటి ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.