ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ సిరీస్లో భారత్ను గాయాల బెడద వదలడం లేదు.
ఇప్పటికే కీలక ఆటగాళ్ళైన కెఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమిలు సిరీస్కు దూరమవ్వగా ఇప్పుడు మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సిరీస్కు దూరమయ్యాడు.
సిడ్నీ నుంచి భారత్కు బయల్దేరి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకోనున్నాడు జడేజా.
సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో స్టార్క్ బౌలింగ్లో దూసుకొచ్చిన బౌన్సర్ ఆడబోతూ జడేజా ఎడమ చేతి బొటన వేలికి గాయం అవ్వడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం అతడిని స్కానింగ్కు పంపిన విషయం తెలిసిందే.
అయితే రెండో ఇన్నింగ్స్లో అతడు పెయిన్ కిల్లర్స్ వాడి బ్యాటింగ్కు సిద్దపడినా మరో వికెట్ పడకపోవడంతో ఆ అవకాశం రాలేదు.
దీంతో నాలుగో టెస్ట్ నుంచి అతడిని తొలగించి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని జట్టు యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సిడ్నీ టెస్టులో మరో ఇద్దరు భారత ఆటగాళ్ళు సైతం గాయాలపాలైన విషయం తెలిసిందే. తొడ కండరాల గాయంతో హనుమ విహారి బాధపడుతుండగా, వెన్నునొప్పితో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం బాధపడుతున్నాడు.