తమ సంస్థ ఓ దివ్యాంగుడిని ఫ్లైట్ ఎక్కనివ్వలేదన్న వచ్చిన విమర్శలపై ఇండిగో సీఈఓ రోనోజయ్ దత్తా విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగకుండా ఉండాల్సిందని చెప్పారు. అయితే ఆ బాలుడు తీవ్రంగా భయపడుతున్నాడన్న కారణంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా తమ సిబ్బంది అతడిని విమానం ఎక్కనివ్వలేదని వివరణ ఇచ్చుకున్నాడు. అయితే దీనిపై ఆ కుటుంబానికి కలిగిన అనుభవానికి పశ్చాత్తాపం పడుతున్నానని, ఆ బాలుడికి ఎలక్ట్రిక్ వీల్చైర్ కొనిస్తానని చెప్పుకొచ్చాడు.