పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 28 నుంచి అంటే గత మూడు వారాల నుంచి ఈ దేశం పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించడంతో భారత్తో పాటు పలు దేశాల్లో దీని ధర ఆకాశాన్ని తాకింది. సోమవారం నుంచి ఈ నిషేధాన్ని ఎత్తేస్తున్నామని, తిరిగి ప్రపంచ మార్కెట్కు సరఫరా చేస్తున్నట్లు ఇండోనేషియా పేర్కొంది. కొత్త నిబంధనల వల్ల వీటి ఎగుమతులు ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశాలు లేవని రాయిటర్స్ సంస్థ పేర్కొంది.