ధన్బాద్–అలెప్పి ఎక్స్ప్రెస్ రైల్ బాత్రూమ్ వాష్బేసిన్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డను వదిలేసి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఈ ట్రైన్ విశాఖ రైల్వే స్టేషన్కు రాగానే బీ1 బోగీ లో పసికందు ఏడుపు విని తోటి ప్రయాణికులు టాయిలెట్ ను చెక్ చేయగా.. అందులోని వాష్ బేసిన్లో ఈ పసికందు కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆర్పీఎఫ్ పోలీసులు స్టేషన్కు చేరుకుని ప్రాథమిక పరీక్షల అనంతరం రైల్వే ఆసుపత్రికి తరలించారు. పాప తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నారు.