గుండెపోటుతో ఇంటర్​ విద్యార్థి మృతి

By udayam on May 10th / 11:21 am IST

ఇంటర్​ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి పరీక్షా కేంద్రం వద్ద గుండెపోటుకు గురై మరణించిన విషాద ఘటన ఎపిలోని గూడూరులో చోటు చేసుకుంది. కొమ్మవారిపల్లెకు చెందిన సతీష్​ ప్రతీరోజు తన ఊరు నుంచి గూడూరు పరీక్ష కేంద్రానికి వచ్చేవాడు. ఈరోజు పరీక్ష కేంద్రం బయట కూర్చుని విపరీతంగా చెమటలు కక్కుతూ కూలిపోయాడు. దీంతో విద్యార్థులు అక్కడే ఉన్న పోలీసులకు విషయం చెప్పడంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సతీష్​ మృతిచెందాడని వైద్యులు ధృవీకరించారు.

ట్యాగ్స్​